కర్నూలులో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కల్లూరు చౌడేశ్వరీదేవి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. ఉగాది రోజున రైతులు వారి ఎద్దులకు పూజా కార్యక్రమాలు చేసి ఆలయం చూట్టు బురదలో ప్రదక్షిణలు చేయిస్తారు. మరుసటి రోజున రజకులు గాడిదలకు బండ్లకి కట్టి చౌడేశ్వరీ మాత ఆలయం చూట్టు తిప్పుతారు. బురదలోనూ పోటీపడి ఆలయం చుట్టూ తిప్పారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ వేడుకలకు తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.